Kannappa | క‌న్న‌ప్ప టీంకు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్ !

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన డివోషనల్ ఎపిక్ డ్రామా ‘కన్నప్ప’ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైంది. నటుడు విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అన్ని హంగులతో సినిమా రూపొందించబడింది.

ఈ నేపథ్యంలో, సినిమాకు భారీ హైప్ ఏర్పడగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్ర యూనిట్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 27 నుంచి 10 రోజుల పాటు ఈ సినిమాకు టికెట్ రేట్లను రూ.50 + జీఎస్టీ మేర పెంచుకునే వెసులుబాటును ఇచ్చింది. ఈ పెంపు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ రెండింటిపై వర్తించనుంది. దీంతో టికెట్ ధరలు మల్టీప్లెక్స్‌లలో సుమారు రూ.236, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.206.50 వరకు ఉండే అవకాశం ఉంది.

Leave a Reply