Kancha Gachibowli | మొక్క‌లు నాటుతారా.. జైలుకెళ్తారా.. ? సుప్రీం వార్నింగ్

న్యూ ఢిల్లీ – కంచ గచ్చిబౌలి భూములలో జులై 23 లోగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే తెలంగాణ సిఎస్ తో సహా ఈ ఘటనకు బాధ్యులైన అధికారులందరూ జైలుకు వెళ్లవలసి ఉంటుందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ బి ఆర్ గవాయ్ స్పష్టం చేశారు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం కీలక వ్యాఖలు చేసింది. పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్‌ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన ధర్మాసనం హెచ్చరించింది. సీఎస్‌తో పాటు కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని చెప్పింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని.. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టం చేయాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆదేశించింది.

లాంగ్‌ వీకెండ్‌ చూసి ఎందుకు చెట్ల తొలగింపు పనులు చేపట్టారని మరోసారి ధర్మాసనం ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జెసిబిలతో ఆ భూములలోని చెట్లు ఎందుకు కొట్టివేయాల్సి వచ్చిందో సిఎస్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని చీఫ్ జస్టీస్ అన్నారు.. పర్యావరణ విధ్వంసాన్ని సహించబోమని, అందుకు బాద్యులైనా సరైన సమయంలో చర్యలు ఉంటాయని అన్నారు. ఆ భూములలో కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలు స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు.

కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కౌంటర్‌ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. ఈ సందర్భంగా విజిల్‌ బోయర్స్‌, విద్యార్థులపై కేసుల విషయాన్ని న్యాయవాదులు కోర్టు ఎదుట ప్రస్తావించారు. కేసులు కొట్టివేయాలని అప్లికేషన్‌ దాఖలు చేశామన్న న్యాయవాదులు తెలిపారు. అయితే, ఈ పిటిషన్‌తో కలిసి విచారించడం కుదరదని.. కేసులు కొట్టివేయాలన్న అప్లికేషన్స్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అవసరమైతే మరో పిటిషన్‌ వేయాలని కోర్టు సూచించింది. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై విచారణను జులై 23వ తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply