మహబూబాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ వైద్యశాలను న్యాయమూర్తులు ఇవాళ తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు, రోజువారి భోజనం, వైద్యాధికారుల పనితీరు పట్ల మహబూబాబాద్ జిల్లా కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి సురేష్, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి తిరుపతిలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలోనీ ప్రతి వార్డును తిరిగి రోగులకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వైద్యులు, కోర్టు సిబ్బంది, తదితరులున్నారు.
WGL | ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన న్యాయమూర్తులు
