జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రఖ్యాత టోక్యో మెట్రోను సందర్శించింది. తొమ్మిది లైన్లతో సమర్ధవంతంగా నిర్వహించబడుతున్న టోక్యో మెట్రో అత్యాధునిక కార్యాచరణ సామర్థ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని సీఎం బృందం పరిశీలించింది.
స్థానిక ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతమైన సేవలను అందించే విధానాలను అధ్యయనం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) రెండవ దశ విస్తరణ ప్రణాళికలో భాగంగా ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం టోక్యో మెట్రోను సందర్శించింది.