జన్నారం,మే 12 (ఆంధ్రప్రభ): పాదయాత్ర చేసి ప్రభుత్వాసుపత్రిలో ఎఐసీసీ జాతీయ కన్వీనర్,ఎమ్మెల్యే, రాష్ట్ర చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు,నేతలు నేటి ఉదయం 7 గంటలకు శ్రమదానం చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఏఐసీసీ జాతీయ కన్వీనర్ రాహుల్ బాల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బిల్లయ్యనాయక్, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ట్రైనింగ్ క్యాంప్ ఇంచార్జి రానా ప్రతాప్, తదితరులంతా మూడు రోజుల్లో శిక్షణలో ఉన్న ఆదివాసీలంతా శ్రమదానం చేశారు.
ముందుగా హరిత రిసాల్ట్ ఆవరణలో కార్యక్రమంలో ఉన్న ఆదివాసీలంతా యోగ కార్యక్రమం చేశారు.ఆ తరువాత మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ నుంచి స్థానిక అంబేద్కర్ విగ్రహం మీదుగా పాదయాత్రగా ఆసుపత్రి వరకు వెళ్లారు.
ఆ తర్వాత ఆస్పత్రి ఆవరణలో ప్లాస్టిక్ పరికరాలను, చెత్తను తొలగించి వారంతా శ్రమదానం చేశారు
.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు గోల్కొండ ఉమాశ్రీ, గంగాదేవి,పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.కోటియానాయక్, రాష్ట్ర నాయకులు మల్లేశ్వరి శ్రీకాంత్, శ్రీను,వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ,ఫసిహుల్ల,పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం,పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు అజ్మీర నందునాయక్,పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ సీనియర్ నేతలు జి.మోహన్ రెడ్డి,ఎం.రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, ముత్యం రాజన్న,మచ్చ శంకరయ్య, ముత్యం సతీష్,రాజన్న యాదవ్, సుధీర్ కుమార్,సుధాకర్ నాయక్,గంగన్నయాదవ్,టౌన్ ప్రెసిడెంట్ రమేష్, మౌలానా, ఇందన్న,హజార్,సాగర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.