AP | మానవత్వం చాటుకున్న జగన్..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానత్వాన్ని చాటుకున్నాడు. బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలైన మహిళ రహదారిపై ఉండడం చూసి చ‌లించిపోయారు. విజయవాడలో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న సందర్భంలో వారిధిపై ప్రమాదం జరగడం, వృద్ధురాలు తీవ్ర గాయాలతో ఉండటాన్ని చూసి వెంటనే 108కు స్వయంగా జగనే ఫోన్ చేసినప్పటికీ, ఎటువంటి స్పందన లభించకపోవడంతో తక్షణమే ఆమెను వైద్య చికిత్సలు అందించి, ఆసుపత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కు అప్పగించారు.

అటుగా వెళుతున్న ప్రైవేటు అంబులెన్స్ పై ఆ వృద్ధురాలిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్సీ స్వయంగా తీసుకువెళ్లారు. ఆమెకు ప్రథమ చికిత్సతో పాటు, అన్ని చికిత్సలు అందే వరకు అక్కడే ఉన్న అరుణ్ కుమార్, ఆమె ఆరోగ్య వివరాలను ఫోన్ ద్వారా జగన్ కు సమాచారం అందించారు. అలాగే వృద్దురాలికి ఆర్థిక సహాయాన్ని కూడా మొండితోక అరుణ్ కుమార్ అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *