జన్నారం, మే 31 (ఆంధ్రప్రభ) : ఇషికా ట్రైనింగ్, ప్లేస్మెంట్స్ ఇన్స్టిట్యూట్ సంస్థ ఉద్యోగాలకు ఎంపిక చేస్తూ పలువురి మన్ననలు పొందుతుంది. ఎక్కడో విదేశాల్లో ఉండి, సేవ చేయడమే కాకుండా సొంత ఊర్లోని పెద్దలను, యువకులను చేరదీసి తనకున్న జ్ఞానంలో కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పుతూ ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని 2024 నవంబర్ 22న మండలంలోని తొమ్మిది గుడిసెల పల్లెకు చెందిన ఎండీ పంచెర్పుల రఘువర్మ ఇషికా ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేశారు. ఎండి రఘువర్మ సేవే మార్గంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థ విజయవంతంగా నడుస్తోంది. విద్యార్థులు,పెద్దలకు కెరీర్ ప్రారంభానికి ఒక మంచి వేదికగా ఇది మారింది.
ఇషికా సంస్థ ద్వారా ఐటీ,నాన్-ఐటీ,బ్యాంకింగ్, ఇండస్ట్రీకి సంబంధించిన శిక్షణలు యువకులకు,పెద్దలకు అందుబాటులో ఉన్నాయి.ఇప్పటివరకు సంస్థ 60 మందికి యువకులకు శిక్షణ ఇవ్వగా,అందులో 16 మందికి ప్లేస్మెంట్ కల్పించింది.వారంతా మంచి జీతభత్యాలతో స్థానికంగా,ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.ఇటీవల ఇషికా సంస్థ పిల్లల కోసం వేసవి శిబిరం (సమ్మర్ క్యాంప్)ను ప్రారంభించి,40 మంది విద్యార్థులతో విజయవంతంగా నిర్వహించింది.పిల్లలు ఆసక్తిగా కంప్యూటర్ నేర్చుకుంటూ, భవిష్యత్ కెరీర్ను కనుగొంటున్నారు.అలాగే క్విజ్, సైన్స్ ఫెయిర్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు,ట్రెజర్ హంట్ లాంటి పోటీలు నిర్వహించి విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీస్తూ ప్రోత్సహించారు.అన్ని పోటీలలో బాలుర జట్టు విజయం సాధించింది,బాలికల జట్టుతో పోటీపడుతూ ఈ గౌరవాన్ని గెలుచుకుంది.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు పంచెర్పుల రఘు వర్మ మాట్లాడుతూ… సమ్మర్ క్యాంపుల ద్వారా వేసవిలో విద్యార్థులను ఆకర్షిస్తున్నామన్నారు. ఈ కార్యకలాపాలు ప్రతి సంవత్సరం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.తమ సంస్థ ద్వారా ఆసక్తి ఉన్న పెద్దలకు,పిల్లలకు పీజీడీసీఎ,డీసీఎ,డీటీపీ వంటి అనేక కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఐఎస్ఓ సర్టిఫికెట్ ఇస్తామన్నారు.ఆసక్తి ఉన్న యువతీ, యువకులు, పెద్దలు, చిన్నారులు తమ వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకుని శిక్షణ పొంది, ఉద్యోగం సాధించి,ఉపాధి పొందాలని ఆయన కోరారు.