షాద్ నగర్, మార్చి 29 (ఆంధ్ర ప్రభ) :షాద్ నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల రాయికల్ బాసుపల్లి లింగంకు సంబంధించిన ఐరన్ షాప్ ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధం అయ్యిందని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపుగా లక్ష రూపాయల నష్టం జరిగింది.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.