Kurnool | ఐపిఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు..

కర్నూలు బ్యూరో : ఆదోని టౌన్ లోని ఎల్లమ్మ కొండ మర్రిచెట్టు దగ్గర ఏడు మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, రూ.91లక్షల నగదు స్వాధీన పరుచుకున్నారు. వీటితో పాటు ఏడు మొబైల్ ఫోన్లు, నిందితుల నుంచి స్వాధీన పరుచుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఆదోనిలోని మసీదుపురంకు చెందిన ఇస్మాయిల్, బోయగిరికి చెందిన బి.మహానంది, మరాఠి వీధికి చెందిన బోయ రమేశ్, కర్ణాటకలోని గౌరీబిధనూర్, పురువంకర కు చెందిన ఎస్ రాజేష్, ప్రకాశం లోని ఒంగోలు జిల్లా చెందిన చుండి శ్రీనివాస రావు, ఒంగోలు పట్టణంలోని సత్యనారాయణపురం చెందిన అడ్డాల కల్యాణ్, హైదరాబాద్ (ఐజ)కు చెందిన రఘు ఆచారి లు ఉన్నారు. ఈ మేరకు అరెస్టు వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్థానిక కె ఎస్ వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఆదోని డిఎస్పీ హేమలతని , ఆదోని ఒన్ టౌన్ సిఐ శ్రీరామ్ , ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మునిస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుస్సేన్ భాషాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *