ఢిల్లీ: మయన్మార్, థాయ్ లాండ్ లో భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన సహాయ కార్యక్రమాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయ చర్యలపై సంప్రదించాలని విదేశాంగ శాఖను ఆదేశించారు.