IND vs SL-W | రెండో టీ20 ఫేవరెట్గా భారత్..

విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరగనున్న రెండో టీ20లోనూ భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్లో ఘనవిజయం సాధించిన టీమిండియా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్పై పట్టు బిగించాలని చూస్తోంది. గత పది టీ20ల్లో శ్రీలంకపై ఎనిమిది సార్లు గెలిచిన భారత్, గత ఆదివారం నాటి మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, ఫీల్డింగ్లో ఐదు క్యాచ్లు వదిలేయడం ఒకింత ఆందోళన కలిగించే అంశం.
మరోవైపు, శ్రీలంక జట్టు పూర్తిగా కెప్టెన్ చామరి ఆటపట్టుపైనే ఆధారపడుతోంది. గత రెండేళ్లలో ఆమె అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికీ, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ వంటి ఇతర బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించడంలో విఫలమవుతున్నారు. శ్రీలంక సవాల్ విసరాలంటే, కనీసం ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడటం తప్పనిసరి.
బౌలింగ్లో భారత్ పటిష్టం.. ఆకట్టుకున్న వైష్ణవి శర్మ
భారత బౌలర్లు గత మ్యాచ్లో కట్టుదిట్టమైన ప్రదర్శనతో శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. భారత్ బౌలర్ల ధాటికి శ్రీలంక 121 పరుగులకే పరిమితమైంది. ముఖ్యంగా అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ తన నియంత్రణతో అందరినీ ఆశ్చర్యపరిచింది. వికెట్లు తీయకపోయినా, పరుగులను నియంత్రించడంలో ఆమె చూపిన ప్రతిభ టీ20 ప్రపంచకప్ రేసులో ఆమెను ముందుంచేలా ఉంది. అనంతరం జెమిమా రోడ్రిగ్స్ అర్ధ సెంచరీతో రాణించడంతో భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
పిచ్ రిపోర్ట్, వాతావరణం..
ఇక ఈరోజు (మంగళవారం) జరగబోయే రెండో మ్యాచ్కు వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ, పిచ్ కాస్త నెమ్మదించే అవకాశం కనిపిస్తోంది. తొలి మ్యాచ్ జరిగిన పిచ్పైనే రెండో మ్యాచ్ కూడా జరగనుంది. బంతి కాస్త నెమ్మదిగా వచ్చే (Two-paced) అవకాశం ఉండటంతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. సాయంత్రం వేళ మంచు కురిసే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు మరోసారి ఛేజింగ్కే మొగ్గు చూపే అవకాశం ఉంది. సిరీస్ తిరువనంతపురానికి తరలకముందే… ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవాలని భారత్, సిరీస్ను సమం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉన్నాయి.
