- లంచ్ సమయానికి వరుస వికెట్లు
లీడ్స్ : ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు భారత జట్టు తన ఆధిపత్యాన్ని మరింతగా బలపరచింది. తొలి రోజు లంచ్ బ్రేస్ సమయానికి 359/3తో ఆట ముగించిన భారత జట్టు, రెండో రోజు మరో కీలక ప్రదర్శనతో స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టించింది.
కెప్టెన్ శుభ్మన్ గిల్ తన శతకాన్ని 147 పరుగుల వరకు కొనసాగించి ఔటయ్యాడు. కెప్టెన్సీ టెస్ట్లో శతకం చేసిన ఐదవ భారత ఆటగాడిగా గిల్ అరుదైన ఘనతను సాధించాడు.
రిషబ్ పంత్, తనదైన స్టైల్లో ఆడి 100 పరుగులు పూర్తి చేసి టెస్ట్ క్రికెట్లో తన 7వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ శతకం ద్వారా అతను ఎమ్మెస్ ధోనిని అధిగమించి టెస్ట్ల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత వికెట్కీపర్గా నిలిచాడు. ఇక తన ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు బాదిన పంత్ 134 పరుగులు చేసి ఆకట్టుకోగా… జోష్ టోంగ్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
ఇక ఆ తరువాత కరుణ్ నాయర్ డకౌట్ కాగా, శార్దూల్ ఠాకూర్ (1) ఔటయ్యాడు. తరువాత కరుణ్ నాయర్ డకౌట్ గా వెనుదిరిగి, శార్దూల్ ఠాకూర్ (1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (2) ఉండగా.. రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 7 వికెట్లకు 454 పరుగులు చేసింది.
పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించకపోవడంతో భారత బ్యాట్స్మెన్ చెలరేగారు. దీంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. అయితే, ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. బ్రైడాన్ కార్స్, జోష్ టోంగ్, షోయబ్ బషీర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.