ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఆసీస్తో జరుగుతున్న తొలి సెమీస్లో.. టీమిండియా 200 పరుగులు చేసింది. ఆసీస్ నిర్ధేశించిన 256 పరుగుల భారీ ఛేదనలో టీమ్ ఇండియా.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ సెంచరీకి చేరువయ్యాడు. దీంతో బారత జట్టు 39.3 ఓవర్లలో 200 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (80) కేఎల్ రాహుల్ (10) ఉన్నారు. టీమిండియా విజయానికి 63 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది.