IKP CENTER | రైతులను దోచుకుంటుంది వాళ్లే..

IKP CENTER | రైతులను దోచుకుంటుంది వాళ్లే..

IKP CENTER | టేకుమట్ల, ఆంధ్రప్రభ : రైతులను దోచుకుంటున్నది.. ఐకెపి సెంటర్ నిర్వాహకులు.. రైస్ మిల్లర్ యజమానులని.. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి రేగొండ మండలాల కేంద్రాలలో నిర్వహిస్తున్న ఐకెపి సెంటర్ నిర్వాహకులు మ్యాచరు తరుగు పేరుతో ఒక బస్తాకు నాలుగు కిలోల నుండి 5 కిలోల వడ్లను దౌర్జన్యంగా రైతులను బెదిరిస్తూ తీస్తున్నారని సదరు రైస్ మిల్లర్ల ఓనర్లతో కుమ్మక్కైన ఐకెపి నిర్వాహకులు రైతులను మోసం చేస్తూ వస్తున్నారు అన్నారు. ముఖ్యంగా టేకుమట్ల చిట్యాల మండలాలలోని రైస్ మిల్లర్ల యాజమానులు చెప్పిందే వేదంగా.. ఐకెపి సెంటర్ నిర్వాహకులు నడుచుకుంటున్నారని.. జిల్లా వ్యవసాయ సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు.

వారి అక్రమాలకు అడ్డులేకుండా పోతుందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పంట గిట్టుబాటు ధర, బోనస్ లు వారు తీసే తరుగులోనే పోతుందని.. రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే ఐకెపి సెంటర్ నిర్వాహకులు మ్యాచరుకు రావట్లేదని రైతులను ఇబ్బందుల గురి చేస్తూ వస్తున్నారని చెప్పారు. ఈ విషయం పై జిల్లా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, అదే విధంగా సిపిఎల్ పత్తి కొనుగోళ్ల విషయంలో కూడా ఇదే ధోరణి అవలంభిస్తున్న సంబంధిత నిర్వాహకుల పై వెంటనే ప్రభుత్వం జిల్లా అధికారిక యంత్రంగా స్పందించాలి అన్నారు. లేని ఎడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం వ్యవసాయ సంబంధిత డైరెక్టర్ కి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని అన్నారు.

Leave a Reply