ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడు అలా అయితే లోకంలో ఇన్ని హత్యలు, కల్లోలాలు ఎందుకు?

భగవంతుడిని అంతమొందించాలని పురాణకాలంలో రాక్షసులు ప్రయత్నించారు. ఆధునిక రాక్షసులు మనిషిలోని దేవుడిని దేవుడిలో దాగిఉన్న దయాదాక్షణ్యాలను అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతి ప్రాణిలో దాగి ఉన్న భగవంతుడిని చూడజాలక శరీరాన్ని చూసేవారు హత్యలు చేస్తూ కల్లోలాలను సృష్టిస్తున్నారు. భగవంతుడు అంతటా ఉన్నాడని నమ్మినవారు స్వార్థానికి దూరంగా ఉంటారు. స్వార్థం జ్ఞానాన్ని అంతం చేస్తుంది. స్వార్థం ఉన్నవారు దేవుడిని చూడలేరు. ఆశా, కోరిక, అభిలాష అనేవి అంత: శత్రువులు అవి నిజమైన రాక్షసులు, ఇటువంటి గుణాలు కలవారు స్వార్థంతో లోకంలో కల్లోలాలు సృష్టించడానికి కారణభూతులవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *