ICC Champions Trophy | 30 ఓవర్లకి నాలుగు వికెట్లు డౌన్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ – బంగ్లా జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు… 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.
ఈ క్రమంలో 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ (41) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి (22) రెండో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన శ్రేయస్ అయ్యార్ (15), అక్షర్ పటేల్ (8) పరుగులకు వెనుదిరిగారు.
ఇక ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (56) – కేఎల్ రాహుల్ () ఉన్నారు. టీమిండియా స్కోర్ 145/4.