HYDRAA | హయత్‌ నగర్ సిఐ పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం …

హైదరాబాద్ – హయత్‌నగర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడ సర్వే నెంబర్ 951,952లో వివాదాస్పద భూమిని పరిశీలించేందుకు వెళ్లిన రంగనాథ్.. ఆ భూమిలో మారణాయుధాలను చూసి షాక్ అయ్యారు. దీంతో ప్లాటు యజమానులపై మారణాయుధాలతో దాడి చేస్తే, హత్యయత్నం కేసు పెట్టకుండా ఏం చేస్తున్నారని సీఐని ప్రశ్నించారు. మీ కొనుగోలు చేసిన స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ ఫైర్ అయ్యారు.

ముందుగా ఆయ‌న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడ గ్రామంలోని రాజాజీ నగర పేరిట వేసిన లే ఔట్ ను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో 190 వరకు ప్లాట్లతో ఉన్న లేఅవుట్ లోని పార్కులు, రహదారులు కలిపేసి సమ్మిరెడ్డిబాల్ రెడ్డి తప్పుడు ధ్రువపత్రాలతో తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ అక్కడి ప్లాట్ యజమానులు గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు.ఆక్రమణలను, రహదారులకు అడ్డంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా తొలగించింది. ప్లాట్ యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే మళ్ళీ అక్కడ సమ్మిరెడ్డి బాల రెడ్డి నిర్మాణాలు చేపట్టగా ప్లాట్ యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమ్మిరెడ్డి వాళ్ళ మీద దాడి చేసి తరిమేశాడు అని ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ క్షేత్ర స్థాయి పర్యటన చేసి అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు.
రాజాజీ నగర లేఔట్ ప్రకారం రహదారులు, పార్కులను కబ్జాల చేరా నుంచి విడిపిస్తామని. ఆక్రమణలకు పాల్ప‌డిన వాళ్ళపై లోతుగా పరిశీలించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట ఇవ్వడంతో మాటివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కొహె డ విలేజ్ లోని కొత్త చెరువును కమిషనర్ సందర్శించారు. చెరువులో తమ స్థలాలు మునిగిపోయాయి అనే పిర్యాదుల విషయమై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇలాంటి సమస్యల కోసమే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేశామని, ఇది బాధితులకు భరోసా ఇస్తుందని బాధితులు, స్థానికులకు వివరించారు. ఏదైనా భూ వివాదం, కంప్లైంట్ ఉంటే హైడ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Leave a Reply