హైదరాబాద్ : బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద కొరియన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన మూడు అంతస్తుల ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ ట్రయల్ రన్ను అధికారులు ఈరోజు ప్రారంభించారు. ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ను 10 రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
ఇదిలా ఉండగా, ఈ స్మార్ట్ పార్కింగ్ ప్లాట్ఫామ్ ఒకేసారి 72 కార్లను పార్క్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అధునాతన ఆటోమేషన్ సాంకేతికతతో, వాహనాలను పార్క్ చేయడం.. తిరిగి తీసుకురావడం వంటి ప్రక్రియలు పూర్తిగా ఆటోమేటిక్గా సాగుతాయి.
దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడమే కాకుండా, పార్కింగ్ కు అవసరమైన స్థలం కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ దశలో వాహనదారుల అనుభవాలను విశ్లేషించి అవసరమైన మార్పులు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఈ పార్కింగ్ వ్యవస్థ విజయవంతమైతే, నగరంలోని ఇతర ప్రాదేశాల్లోనూ దీనిని విస్తరించే ప్రణాళికలను నగర అధికారులు పరిశీలిస్తున్నారు.