Tamil Nadu | నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

త‌మిళ‌నాడు : తమిళనాడు (Tamil Nadu) లో వివాహేతర సంబంధం వల్ల ఓ భర్త భార్యను హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరునింద్రవూర్ (Thirunindravur) మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎస్ గోమతి కౌన్సిలర్‌గా పని చేస్తుంది. పదేళ్ల కిందట ఈ జంటకు పెళ్లి కాగా వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే గోమతి కి వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు తరచుగా గొడవలు జరిగేవి.

గోమతి తాజాగా ఓ అబ్బాయిని కలిసినట్లు భర్తకు తెలిసింది. దీంతో గోమతి (Gomati) భార్య స్టీఫెన్ రాజ్ ఆమెతో గొడవపడ్డాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో భర్త స్టీఫెన్ (Stephen) ఆమెను నడి రోడ్డుపై కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply