AP | హిందూపురం మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం
23 మంది మద్దతుతో విజయం
హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే
శ్రీ సత్యసాయి బ్యూరో, ఫిబ్రవరి 3(ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కుమార్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఆరు నెలల క్రితం వైసీపీ ఛైర్ పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.