AP | వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌పై విజయవాడ కోర్టు ఈరోజు విచారించింది.

నిందితుల నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాలని… వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం పిటిషన్..

కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పిటిషన్‌ను రేపటికి వాయిదా వేసింది. వల్లభనేని వంశీకి జైలులో కల్పిస్తున్న సౌకర్యాలను తెలియజేయాలని జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *