హసన్పర్తి , ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు దుయ్యబట్టారు. రెండో డివిజన్ వంగపహాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రంలో కనీసం గన్నీ సంచులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించేందుకు లారీలు లేక నానాయాతన పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
TG | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం .. మాజీ మంత్రి ఎర్రబెల్లి
