పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు నిధులు విడుదల..

హైదరాబాద్, ఆంధ్రపభ : తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 894.80 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఏపీపీఎఫ్సీ బాండ్స్ సిరీస్లో భాగంగా టీజీపీఎఫ్సీఎల్ వాటాకు సంబంధించిన అసలు, వడ్డీ చెల్లించడం కోసం ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. వాస్తవానికి ఈ చెల్లింపులు 2022 నవంబర్ 9న చెల్లించాల్సి ఉంది.
