Former MP | ఈడీ విచార‌ణ‌..

Former MP | ఈడీ విచార‌ణ‌..

  • హాజ‌రైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
  • మద్యం కుంభకోణంపై ప్ర‌శ్న‌లు

Former MP | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మ‌రం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందనే కేసులో ఈ రోజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ ప్ర‌శ్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఏ5 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.

గతేడాది మేలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేయగా, ఇప్పుడు విచారణను ముమ్మరం చేసింది. 2019 నుంచి 2024 మధ్య రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏమిటి? మద్యం కంపెనీల నుంచి వచ్చిన లంచాలు, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా విదేశాలకు నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్టు సమాచారం.

ఈ విచారణలో ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు. ఇదే కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రేపు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని అధికారులు పిలిచారు. ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసి, బెయిల్‌పై ఉన్న మిథున్ రెడ్డిని ఇప్పుడు మనీలాండరింగ్ కోణంలో ప్రశ్నించనున్నారు.

Leave a Reply