డోన్ రూరల్, ఏప్రిల్ 14 (ఆంధ్రప్రభ): విద్యుత్ షాక్ తో రైతు మృతిచెందిన ఘటన డోన్ లో చోటుచేసుకుంది. డోన్ మండల పరిధిలోని కామగానిగుంట్ల గ్రామానికి చెందిన రైతు వడ్డే రమేష్ పొలానికి నీరు కట్టే సమయంలో విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. మృతదేహాన్ని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
KNL | విద్యుత్ షాక్ తో రైతు మృతి..
