- భారత విద్యార్థుల అత్యవసర తరలింపు
- మొదటి విమానం ఈ రోజు రాత్రి ఢిల్లీకి
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, భారతీయ విద్యార్థుల అత్యవసర తరలింపు కోసం ఇరాన్ తన మూసివేసిన గగనతలాన్ని తెరిచింది.
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ గగనతలం ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలకు మూసివేసింది. అయితే, భారతీయులను సురక్షితంగా తరలించడానికి ఇరాన్ ప్రత్యేక ఎయిర్ కారిడార్ను అందించినట్లు ప్రకటించింది.
ఈ పరిణామాల మధ్య భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధు’ ద్వారా ఇరాన్లో చిక్కుకుపోయిన కనీసం 1,000 మంది భారతీయ విద్యార్థులు వచ్చే రెండు రోజుల్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఈ తరలింపులో భాగంగా మొదటి విమానం ఈ రోజు రాత్రి 11:00 గంటలకు (IST) ఢిల్లీలో ల్యాండ్ కానుంది. అనంతరం మరో రెండు విమానాలు (ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం) శనివారం బయలుదేరనున్నాయి.