Eng vs India: రెండో ఇన్నింగ్స్ లోనూ రిషబ్ శతకం

హెడింగ్లే టెస్టులో భారత క్రికెటర్లు సెంచరీల పండుగ చేసుకుంటున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్ వంద కొట్టగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా. మూడంకెల స్కోర్ అందుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ బాదిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లోనే శతకం బాదేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ ఫీట్ సాధించడం అతడికి ఇదే ప్రథమం. ఇంగ్లండ్‌పై ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో వంద కొట్టిన భారతీయుడిగా పంత్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనతకు చేరువైన ఏడో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డుపుటల్లో నిలిచాడీ హిట్టర్

భోజన విరామం తర్వాత గేర్ మార్చిన పంత్ పేసర్ జోష్ టంగ్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అనంతరం అతడి బౌలింగ్‌లోనే ఫోర్ కొట్టి.. డబుల్స్ తీసి ఫిఫ్టీ సాధించాడు. బషీర్‌కు చుక్కలు చూపిస్తూ లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదాడీ చిచ్చరపిడుగు. రూట్ ఓవర్లో సింగిల్‌తో 99కు చేరిన ఈ డాషింగ్ బ్యాటర్.. బషీర్‌ బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ సాధించాడు. ఇక బషీర్ బౌలింగ్ లో రిషబ్ ఔటయ్యాడు. రిషబ్ 118 పరుగులు చేశాడు. రాహుల్ పరుగులతో క్రేజ్ లో ఉండగా, కరణ్ బ్యాటింగ్ కు దిగాడు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది

Leave a Reply