భద్రాచలంలోని (bhadrachalam ) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి ఓ భక్తుడు (devotional ) భారీ విరాళం సమర్పించారు. తన భక్తిభావాన్ని చాటుకుంటూ సుమారు రూ.12 లక్షల విలువైన వెండి (silver) కవచాలను స్వామివారికి కానుకగా (gift ) అందజేశారు. వివరాల్లోకి వెళితే… సంతోష్ కుమార్ రెడ్డి, (santosh kumar reddy ) సాహిత్య దంపతులు 9 కేజీల వెండితో సీతారామ లక్ష్మణులకు కవచాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. స్వామివారికి శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు చేసి వాటిని సమర్పించారు. భక్తిశ్రద్ధలతో సమర్పించిన ఈ కానుకను ఆలయ అధికారులు స్వీకరించి, దాతకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ వెండి కవచాలను స్వామివారి అలంకరణ కైంకర్యాలకు వినియోగిస్తామని వారు తెలిపారు.
భద్రాద్రి రామయ్యపై భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసానికి, భక్తికి ఇది నిదర్శనమని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి విరాళాలు క్షేత్ర అభివృద్ధికి, నిత్య కైంకర్యాల నిర్వహణకు ఎంతగానో దోహదపడతాయని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఇలవేల్పు అయిన సీతారామచంద్రస్వామికి తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించడం ద్వారా భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే దాతృత్వం చాటుకున్న సదరు భక్తుడిని పలువురు అభినందించారు.