షిరిడి , ప్రభ న్యూస్ – ప్రముఖ సినీ నటుడు సునీల్ శెట్టి నేడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. అలాగే సాయి నాధుని సమాధిని సందర్శించారు. దర్శనం తర్వాత శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమ్రాజ్ దారాడే ఆయనను సత్కరించి, బాబా వారి తీర్థప్రసాదాలు అందజేశారు . ఈ కార్యక్రమంలో ప్రజా సంబంధాల అధికారి దీపక్ లోఖండే పాల్గొన్నారు.
