నంద్యాల బ్యూరో మార్చి 30 ఆంధ్రప్రభ …నంద్యాల జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబితా మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత ఐదు రోజులుగా జరిగిన ఉగాది మహోత్సవాలు ఆదివారం నాడు రథోత్సవ కార్యక్రమంతో ముగింపు కార్యక్రమాలు పలికారు.
దేవస్థానం కార్యనిర్వాహ ణ ధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలను కల్పించారు. మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన లక్షలాదిమంది భక్తులకు వసతి సౌకర్యాలను క్యూలైన్లో ఉన్నటువంటి వారికి అన్ని సౌకర్యాలను తాగునీటి వస్తేనే అన్నదాన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
కర్ణాటక నుంచి వచ్చిన కన్నడిగుల వలన శ్రీశైల మహా క్షేత్రం కళకళలాడింది. వచ్చిన భక్తులు పాతాళ గంగ వద్ద పవిత్ర గంగా స్నానం చేశారు. ఆదివారం రథోత్సవ కార్యక్రమంలో లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని కూడా పేద పండితులు వినిపించారు.
శ్రీశైల మహా పుణ్యక్షేత్రం నందు జరుగుచున్న ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు రథోత్సవం కార్యక్రమంనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కన్నుల పండుగగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు రథయాత్ర సంఘటనను తిలకించటం విశేషం. ఉగాది పండుగ దినం సందర్భంగా ప్రముఖ దేవాలయాలైన మహానంది యాగంటి అహోబిలం క్షేత్రాల వద్ద కూడా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తుల కోసం వసతి సౌకర్యలతో పాటు వైద్య సౌకర్యాలను తాగునీటి వసతిని కల్పించారు. మహాశివరాత్రి పండగ సందర్భంగా పాతాళ గంగలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో ఉంచుకుని ఉగాది మహోత్సవాలకు వచ్చిన భక్తులకు పవిత్ర గంగా స్నానం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లతో పాటు బోట్లను ఏర్పాటు చేశారు.
ఉగాది మహోత్సవాల సందర్భంగా ఎవరికి ఎలాంటి ప్రాణాన్ని జరగకపోవడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక కళారాధన బృందాల చె పోటీలను ప్రత్యేకంగా నిర్వహించారు. కళాజాతను నిర్వహించారు. సంస్కృతి కార్యక్రమాలు కన్నడిగులను బాగా ఆకట్టుకున్నాయి. వారు బ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని ఆడపడుచు అయిన భ్రమరాంబిక అమ్మవారికి చీరే సారే ను భక్తితో సమర్పించారు. వచె ఏడాది ఉగాది ఉత్సవాల వరకు కన్నడిగుల కోసం వారు ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో సమర్పించిన వాటిని భద్రంగా దాచి పెట్టడం విశేషం. లక్షలాదిమంది భక్తులు పాల్గొన్న ఈ బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ బస్సులు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
నంద్యాల నుంచి కూడా హుబ్లీ కర్ణాటక ప్రాంతాలకు ప్రత్యేక రైలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వాహ క అధికారి కోరారు.