Delhi Tour | రేపు బిల్ గేట్స్ తో చంద్ర‌బాబు భేటి…

నేటి సాయంత్రం ఢిల్లీకి వెళ్ల‌నున్న చంద్ర‌బాబు,ప‌వ‌న్ క‌ల్యాణ్
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజ‌రు
నేటి రాత్రికి ఇద్ద‌రు అక్క‌డే బ‌స‌
రేపు ఉద‌యం బిల్ గేట్స్ తో చంద్ర‌బాబు భేటి
విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల‌పై చ‌ర్చ‌
గేట్స్‌ ఫౌండేషన్ సాయం కోర‌నున్న చంద్ర‌బాబు
మోదీని ఆమరావ‌తికి ఆహ్వానించ‌నున్న చంద్ర‌బాబు

వెలగపూడి : ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు.

బిల్ గేట్స్ తో చంద్ర‌బాబు

ఇక మ‌ర్నాటి ఉద‌యం బిల్ గేట్స్ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ బిల్ గేట్స్ తో చంద్ర‌బాబు భేటి కానున్నారు.. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల‌లో ఫౌండేష‌న్ ద్వారా సాయం చేయాల‌ని చంద్ర‌బాబు కోర‌నున్నారు. అనంత‌రం ప్ర‌ధాని మోడీని చంద్ర‌బాబు క‌లువ‌నున్నారు.. అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని సీఎం ఆహ్వానించనున్నారు. రాజధాని నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. అలాగే ప‌వ‌న్,చంద్ర‌బాబులు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లువ‌నున్నారు.. అనంత‌రం బుద‌వారం రాత్రికి ఈ ఇద్ద‌రు నేత‌లు బ‌య‌లుదేరి అమ‌రావతికి రానున్నారు.

20వ తేదిన కుటుంబ స‌మేతంగా తిరుమ‌లకు..

ఇది ఇలా ఉంటే 20 వ తేది రాత్రి కుటుంబ స‌భ్య‌లలో క‌ల‌సి తిరుమ‌ల‌కు వెళ్ల‌నున్నారు.. 21న మ‌న‌వ‌డు మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా తిరుమల నిత్యాన్నదాన పథకానికి ఒక రోజుకు అయ్యే ఖ‌ర్చు రూ.44 ల‌క్ష‌ల‌ను తిరుమ‌ల శ్రీవారికి విరాళం ఇవ్వనున్నారు చంద్రబాబు, లోకేష్ కుటుంబసభ్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *