చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మధ్య మ్యాచ్ లో.. ఆర్సీబీ బౌలర్లు అదరగొడుతున్నారు. చెన్నై కీలక బ్యాటర్లను వరుసపెట్టి పెవిలియన్ కు పంపుతున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. చెన్నై ముందు 197 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. అయితే ఈ ఛేజ్ లో… 8.5 వ ఓవర్లో లివింగ్స్టోన్ బౌలింగ్ లో సామ్ కర్రన్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో సీఎస్కే 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర (34) శివం దూబే ఉన్నారు. 9 ఓవర్లకు చెన్నై స్కోర్ 53/4.