చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మధ్య జరుగున్న రసవత్తర పోరులో.. బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక ఇన్నింగ్స్ ఆడి.. అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఓపెనింగ్ ద్వయం ఫిలిప్ సాల్ట్ (32) – విరాట్ కోహ్లీ (31) రాణించారు. వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ రిస్కీ షాట్స్ తో (14 బంతుల్లో 27) మెప్పించాడు. ఇక ఆఖర్లో జితేశ్ శర్మ (12) , టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సులతో 22) ధనాధన్ తో బౌండరీలు బాదారు. దీంతో ఆర్సీబీ స్కోర్ 196కు చేరింది.
ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మతీష పతిరాణా రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అశ్విన్ తలా ఒక్కవికెట్ పడగొట్టారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది.