పోచవరంలో మొసలి కలకలం

పోచవరంలో మొసలి కలకలం
గోదారి ఒడ్డున సేదతీరుతోంది
తాళ్లతో బంధించి నదిలోకి విడుదల
(పోలవరం , ఆంధ్రప్రభ)
పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలం పోచవరం బోటింగ్ పాయింట్ వద్ద మొసలి కలకలం సృష్టించింది. గోదావరి నది ఒడ్డున ఈ మొసలి సేద తీరుతున్న తరుణంలో పాపికొండల విహార యాత్రకు వచ్చిన పర్యాటకులు ఈ మొసలిని గుర్తించారు. తాళ్లతో స్థానికులు బంధించి గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఈ స్థితిలో గోదావరి నదిలోకి ఎవరు దిగవద్దు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
