నెల్లూరు జిల్లాలో మహిళ దారుణ హత్య చోటు చేసుకుంది. కట్నం కోసం మహిళను భర్త, అత్తమామలు, ఆడబిడ్డ వివస్త్రను చేసి కొట్టిచంపిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కట్నం కోసం మహిళను భర్త హరికృష్ణ, అత్తమామలు నాగోరు, నర్సమ్మ, ఆడపడుచు నాగలక్ష్మి గత కొంతకాలంగా వేధిస్తున్నారు. పలుమార్లు ఆమెపై దాడి చేశారు. బాధితురాలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని వారిని హెచ్చరించింది. ఇలా చెప్పడంతో తాజాగా ఆమెపై మరోసారి దాడికి పాల్పడ్డారు. ఫిర్యాదు చేస్తుందని భయపడి రంగునీళ్లు తాగించి ఊపిరాడకుండా చేశారు. అనంతరం వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హతమార్చారు.
ఈ ఘాతుకాన్ని కప్పిపుచ్చుకోవడానికి తానే ఆత్మహత్య చేసుకుందంటూ కుటుంబంలోని వారంతా హైడ్రామా ఆడారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు నెల్లూరు జీజీహెచ్కు మహిళ మృతదేహం తరలించారు. ఇదిలా ఉండగా మహిళ భర్త, అత్తమామలు, ఆడబిడ్డలను పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు