Crime News|నవ వరుడు సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య

గద్వాల (ప్రతినిధి) (ఆంధ్రప్రభ)జోగులాంబ గద్వాల్ జిల్లాలో అదృశ్య.మైన(missing ) నవవరుడి మృతదేహం (dead body) ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల జిల్లా, పాణ్యం (panyam) లభ్యమైంది. తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన జీ తేజేశ్వర్(33)( Tejeswar ) లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్నారు.

గద్వాల జిల్లా కేంద్రంలో గంట వీధిలో నివాసముంటున్న తేజేశ్వర్ జూన్ 17 మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయాడు. మే 18న కర్నూలుకు చెందిన యువతితో తేజేశ్వర్ కు వివాహమైంది. తేజేశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గద్వాల పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు కూడా నమోదయింది. నంద్యాల జిల్లా, పాణ్యం సరిహద్దుల్లో గత రాత్రి తేజేశ్వర్ మృతదేహం గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాణ్యం లో మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తేజేశ్వర్ దారుణ హత్యకు అత్త మామ, తేజేశ్వర్ భార్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

.

Leave a Reply