ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది..

  • ఎమ్మెల్యే జీఎస్సార్..

రేగొండ, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లి గోరి, రేగొండ మండలాల పరిధిలోని జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, వెంకటేశ్వర్లపల్లి, రేగొండ, రామన్నగూడెం తండా, జూబ్లీనగర్ గ్రామాల్లో ఆదివారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పబ్లిక్ కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు వివరించారు. గ్రామాల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో గుటోజు కిష్టయ్య, నాయినేని సంపత్‌రావు, నడిపెల్లి విజయ్‌రావు, మోడెమ్ ఉమేష్ గౌడ్, ఇప్పకాయల నరసయ్య, చిగురుమామిడి కుమారస్వామి, పొనుగోటి వీరబ్రహ్మం, బోయిని కుమారస్వామి, పత్తి తిరుపతి, జోరు సుదర్శన్, పుట్ట రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply