Condolence | పాశమైలారం ప్రమాదం దురదృష్టకరం ‍ – ప‌వ‌న్ క‌ల్యాణ్

అమ‌రావ‌తి – తెలంగాణ రాష్ట్రంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలవ‌డం ప‌ట్ల ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆవేదన వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ట్విట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడం మూలంగా చోటు చేసుకున్న ఈ పరిశ్రమలో గాయపడ్డవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంద‌న్నారు. వారికీ, ఇతర క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply