నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 21(ఆంధ్రప్రభ) : ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి యోగా ఎంతో ముఖ్యమని, దినచర్యలో ఒక యోగ భాగమైనప్పుడే సంపూర్ణ ఆరోగ్యమని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మెడికవర్ హాస్పిటల్స్ (Medicover Hospitals) ఓపి విభాగం వద్ద శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ (Nizamabad) ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరై మాట్లాడుతూ… మెడికవర్ హాస్పిటల్స్ వారు ధైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యతపై తెలియపరిచేందుకు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనిషి ఆరోగ్య పరిరక్షణకు అవగాహన కలిగించే దిశగా కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చని ఆయన సూచించారు.
అనంతరం మెడికల్ హాస్పిటల్స్ వైద్యులు డా.వారిస్ అలీ (Dr. Waris Ali) మాట్లాడుతూ… యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో పురాతనమైందని వారు పేర్కొన్నారు. యోగా చేయడం ద్వారా శరీరం మనసును ఆలోచన విధానాన్ని నియంత్రిస్తుందని తెలిపారు. నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం శ్రేయస్సు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్స్ డాక్టర్ సందీప్ రావు, ఇంటర్వెషనల్ కార్డిలోజిస్ట్, డాక్టర్ ప్రశాంత్ పుల్మలోజిస్ట్, డాక్టర్ యజ్ఞ, డి ఎం.ఎ స్ సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
