తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు

తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు
తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పాలనాధికారిగా పనిచేస్తున్న ఆయనను తొలుత ఏకొండూరు మండల తహసీల్దారుగా నియమించిన కలెక్టర్ ఆ ఉత్తర్వులు రద్దు చేసి తిరువూరు తహసీల్దారుగా పునర్నియమించారు.
గత కొద్ది నెలలుగా డిప్యూటీ తహసిల్దారు నాగమణి వ్యవహరిస్తుండగా, ఆమెనుంచి వైకుంఠరావు బాధ్యతలు స్వీకరించారు.
