- శ్రీశైల డ్యాం నుంచి నీటి విడుదల
- ప్రస్తుతం 880 అడుగులకు చేరుకున్న శ్రీశైలం డ్యాం
- ఎగువ నుంచి 1.62 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం
- ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల
కర్నూలు బ్యూరో, జులై 7 (ఆంధ్రప్రభ) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంగళవారం శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ (Lower Nagarjuna Sagar) కు నీరు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం (Srisailam Reservoir) పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ఎగువ కృష్ణ, తుంగభద్ర నుంచి జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది.
ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 1,62,529 క్యూసెక్కులు ఉండగా..ఇక ఔట్ ఫ్లో 54,191 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా,880.70 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటినిల్వ 215.7080 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 191.6512 టీఎంసీల నీటి నిలువలు ఉన్నాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసిన సంగతి విధితమే.
