Chityala | శిలాఫలకాలు మార్చి కొత్త శిలాఫలకాలు

Chityala | శిలాఫలకాలు మార్చి కొత్త శిలాఫలకాలు
- శంకుస్థాపనలతో ప్రజలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం
- అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనని కోరుకుంటున్నారు
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : అబద్దాలతో మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ రోజు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు శివనేనిగూడెంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేసీఆర్ హయంలో శివనేనిగూడెంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరుగుతూ క్లుప్తంగా వివరించారు. అబద్ధాలతో, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసగించిన తీరు, రెండేళ్ల నుండి ప్రజా వ్యతిరేక విధానాలు మరియు ప్రజలకు బాకీ పడిన వివరాలను ఆయన వార్డులో తిరుగుతూ ప్రజలకు స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. శివనేనిగూడెంలో కెసిఆర్ హయంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించాం.

నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 2 కోట్ల పై చిలుకు నిధులతో ఈ వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధి, అవలంబించిన ప్రజా సంక్షేమ పథకాలతోనే ఎవ్వరినోట విన్నా కెసిఆర్ మాటే వినిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ సకాలంలో అందేవి, జరిగేవి అని ప్రజలు ముక్తకంఠంతో చెపుతూ ఇప్పుడు అవి అలాంటి పరిస్థితిలు లేవని బాధ పడుతున్నారు. అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ నీ పోగొట్టుకున్నామని బాధ పడుతున్నారు..
స్థానిక ఎమ్మెల్యే రెండేళ్ల నుండి శివనేనిగూడెంలో తట్టెడు మట్టి తీయలేదు.. ఎన్నికల సమయంలో శిలాఫలకలు మార్చి కొత్త శిలాఫలకాలు పెట్టి కొత్త శంకుస్థాపనలతో ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఈ రెండేళ్లలో మున్సిపాలిటీకి ఏం చేశారో చెప్పే దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలకు రావాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. డంపింగ్ యార్డు విషయంలో స్థానిక ఎమ్మెల్యే ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డంపింగ్ యార్డు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దీనిపై ఎలాంటి తీర్మానం చేయలేదు. మున్సిపాలిటీలో అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవ్వాలంటే కేసీఆర్ బి ఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
