AP | అనధికార, అక్రమ నిర్మాణాలకు చెక్.. కొత్త మార్గదర్శకాలను జారీ

ఆంధ్రప్రదేశ్‌లో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

పురపాలకశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు:

ఆక్యుపేషన్ సర్టిఫికెట్ పొందడానికి భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలి.
ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లో నివాసానికి అనుమతి ఇవ్వాలి.
నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్‌ను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి.
సంబంధిత అధికారులు సమయానుసారంగా బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలి.
డీవియేషన్ (అనుమతించని మార్పులు) సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు.
డీవియేషన్ ఉన్న భవనాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.
నివాసయోగ్య ధ్రువపత్రం జారీ అయిన తర్వాతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు కల్పించాలి.
అక్రమంగా నిర్మించిన భవనాలకు ట్రేడ్, బిజినెస్ లైసెన్స్‌లు మంజూరు చేయకూడదు.
జోనల్ ప్లాన్ ప్రకారం అనుమతించని మార్పులు లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలి.
బ్యాంకులు రుణాలు మంజూరు చేసే ముందు నివాసయోగ్య ధ్రువపత్రం ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి.
ఈ మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా అధికారులందరూ కఠిన చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *