Char Dham Yatra | రెండు రోజులపాటు హెలికాప్టర్ సేవలు నిలిపివేత !

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాథ్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంతో, రాష్ట్ర ప్రభుత్వం చార్ధామ్ యాత్రలో భాగంగా సాగుతున్న హెలికాప్టర్ సేవలను తాత్కాలికంగా రెండు రోజులపాటు (జూన్ 15–16) నిలిపివేసింది. ఈ నిర్ణయం భద్రతా కారణాలపై తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ మేర‌కు చార్ ధామ్ మార్గంలో ప్రయాణిస్తున్న అన్ని హెలికాప్టర్ సంస్థలకు తాత్కాలికంగా విమాన సేవలు నిలిపివేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈరోజు కేడార్నాథ్ నుంచి గుప్తకాశి వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణాలపై అధికారులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ విభాగం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *