గణపురం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం (Ganapuram) మండలంలో పలు రేషన్ డిపోలను సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. రేషన్ డిపోలు వివరాలను తెలుసుకుని, సరుకులను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలు (Inspections) సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జై.ప్రకాష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అధికారులు తనిఖీలు చేపట్టారు.
బియ్యం పంపిణీ పై ఆరా..
ఈ సందర్భంగా సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ (Deputy Director) జై ప్రకాష్, కమిటీ సభ్యులు మాట్లాడుతూ… గణపురం షాప్ నెంబర్ మూడు రేషన్ డిపో తనిఖీ చేశామన్నారు. ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్న విధానం, రేషన్ బియ్యం వివరాలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం అందించకపోతే రేషన్ షాపులపై, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట భూపాలపల్లి జిల్లా సివిల్ సప్లై అధికారి (Civil Supply Officer) శ్రీనాథ్, పలు మండలాల తహసిల్దార్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.