తెలుగు మహిళల ఆనందోత్సవాలు..

తెలుగు మహిళల ఆనందోత్సవాలు..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : తూర్పు బజారు గాంధీ సెంటర్ నందు తెలుగు మహిళలు అమరావతి మద్దతుగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంతో ఈ రోజు తెలుగు మహిళలు గింజుపల్లి శ్రీదేవి పెద్ది సుజాత నల్లపునేని సుజాత కోడె క్రాంతి పాకాలపాటి అనసూయ కూచితేజ స్వయంగా జై అమరావతి అని రైతే రాజు అని.. ముగ్గులతో రాసి పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ స్వీట్ పంచారు.

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల వెంకట సీతారామయ్య, మాజీ జెడ్పిటిసిలు గింజపల్లి శ్రీదేవి, గజ్జి కృష్ణమూర్తి, సొసైటీ అధ్యక్షులు కర్ల వెంకట నారాయణ, మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్ బాబు ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్ బాబు, జిల్లా బీజేపీ నాయకురాలు ఉత్సవ కమిటీ మెంబర్ కల్లూరి శ్రీవాణి ఉత్సవ కమిటీ మెంబర్లు ముండ్లపాటి జోత్స్న తమ్మారపు గోపి, నీటి సంఘం అధ్యక్షులు యనమదల నరసింహారావు, నల్లపునేని తిరుపతిరావు, హైస్కూల్ కమిటీ చైర్మన్ సముద్రాల రామారావు, మాజీ ఎంపీటీసీ కాకాని బ్రహ్మo, గ్రామ తెదేపా పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి సతీష్ బాబు మాజీ తెదేపా అధ్యక్షులు నల్లపునేని కొండ కర్లహరి కంభం చిరంజీవి జనసేన నాయకులు తన్నీరు గోపీనాథ్ తెదేపా నాయకులు కంభoచిరంజీవి గజ్జి శివ చేని కొండబాబు గింజుపల్లి అరుణమ్మ, కోయ త్రివేణి, చేని నాగమణి, కోట సుధారాణి, హుస్సేనమ్మ కనపర్తి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మహిళలను అభినందించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల వెంకట సీతారామయ్య పెనుగంచిప్రోలు గ్రామంలో తెలుగు మహిళలు గింజపల్లి సుజాత పెద్ది సుజాత, పాకాల పార్టీ అనసూయ, కోడె క్రాంతి, కూచితేజ ప్రత్యేకంగా అభినందించారు. తక్కువ సమయంలో జై అమరావతి, రైతే రాజు నాగలి పట్టుకున్న రైతు ముగ్గును చాలా చక్కగా వేసినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply