Car Overturned | కారు బోల్తా… ముగ్గురు మృతి..

Car Overturned | కారు బోల్తా… ముగ్గురు మృతి..

Car Overturned | ఆదిలాబాద్: కారు బోల్తా (car overturned) పడి… ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జైనథ్ మండలం తరోడ గ్రామం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మూలమలుపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జైనథ్ నుండి ఆదిలాబాద్ (Adilabad) వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పింది. షేక్ మొహినుద్దీన్, షేక్ మోహిన్, కదం కీర్తి సాగర్లు ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను రిమ్స్ కు పోలీసులు తరలించారు.

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల (Road accidents) బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అధికమయ్యాయి. డిసెంబర్ 7వ తేదీ నాలుగు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, మంచు కారణంగా ఓ వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు శ్రీపతి అశ్రిత్ రెడ్డి, పప్పుల శివమణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో ఘటనలో కీసర నుంచి తార్నాకకు వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో హర్షవర్ధన్ (మల్కాజిగిరి నివాసి) మృతి చెందాడు.

Leave a Reply