తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలో మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన ఆపరేషన్ కాగర్ను వెంటనే ఆపాలని, వారితో శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు నాయకుడు అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో షరతులు లేకుండా చర్చలు జరపాలని పేర్కొన్నారు.