ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market ) శుక్రవారం ఉదయం లాభాలతో (Profit note ) ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల (Asia Market) నుంచి సానుకూల సంకేతాలు అందడంతోపాటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్యూ బ్యాంక్) (PSU banks) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ),(IT) ఆటోమొబైల్ (Auto Mobile ) రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభపడ్డాయి.
నేటి ఉదయం ప్రారంభంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 228.15 పాయింట్లు (0.28 శాతం) పెరిగి 81,590.02 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 55.10 పాయింట్లు (0.22 శాతం) లాభపడి 24,848.35 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 102.35 పాయింట్లు (0.18 శాతం) వృద్ధి చెంది 55,679.80 వద్ద ఉంది.
అయితే, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 16.85 పాయింట్లు (0.03 శాతం) స్వల్పంగా తగ్గి 57,143.10 వద్ద, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 62.50 పాయింట్లు (0.35 శాతం) నష్టపోయి 17,950.60 వద్ద ట్రేడవుతున్నాయి.
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గత నెల రోజులుగా నిఫ్టీ 24,500 నుంచి 25,000 పాయింట్ల శ్రేణిలోనే కదలాడుతోంది. సమీప భవిష్యత్తులోనూ ఇదే శ్రేణిలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదా యుద్ధం ఆగిపోవడం వంటి సానుకూల వార్తలు వస్తేనే నిఫ్టీ ఈ శ్రేణిని దాటి పైకి వెళ్తుందని భావిస్తున్నారు.
సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, ఎటర్నల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముందుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.