ఏలూరు జిల్లాలో.. బస్సు ప్రమాదం..
బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో ప్రయాణాలు చేయాలంటనే జనాలు వణికిపోతున్నారు. ఏలూరు వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లా లింగంపాలెం సమీపంలోని జూబ్లీనగర్ వద్ద బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన టైమ్ లో బస్సులు సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సివుంది.

